అంగీరస గణ గోత్ర ప్రవరలు, అంగీరస వంశానికి చెందిన ఒక ఋషి నుంచి బ్రాహ్మణ అవరోహణ ఆరంభం అవుతుంది. దీనినే ప్రవర తెలియజేస్తుంది.[1] వేద ఆచార ప్రకారం, ప్రవర యొక్క ప్రాముఖ్యత, తన సంతతి కోసం, పెద్దవారిని కీర్తిస్తూ, కర్మవేత్తలచే, దాని వినియోగం ఉన్నట్లు కనిపిస్తుంది.[2] నేను కూడా గొప్పవారైన ఫలానా పూర్వీకుల వంశస్థుడిని అన్న సంగతి ప్రకటించుకోవడం ప్రవరలో కనిపిస్తుంది.[3]
బ్రాహ్మణులలోని అతి ముఖ్యమైన పది (10) గోత్రముల వంశానుక్రమం, వంశము, ఉత్పత్తి (వ్యుత్పత్తి), సంతతి, తరము, జన్మము, ఇత్యాదులను పరిశీలించగా, ఈ గోత్రముల వారు పైన ఉదహరించిన ఋషులు తదితరులు పూర్వీకులు అయిన కణ్వుడు, జమదగ్ని, భరద్వాజుడు, కౌండిన్య, గౌతముడు, అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, అగస్త్యుడు గోత్రములు,
గోత్రములు కొన్ని సమూహాలుగా అమర్చబడి ఉంటాయి. అశ్వలాయన సూత్రము ప్రకారము వశిష్ట గణ గోత్ర ప్రవరలులో ఉపమన్యు, పరాశర, జాతుకర్ణ్య , వశిష్ట అని నాలుగు ఉపవిభాగాలుగా ఉన్నాయి. ఈ నాలుగు ప్రతి ఒక్కటిలో మళ్ళీ అనేక ఉప ఉపవిభాగాలుగా విభజించ బడ్డాయి.